America: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి!

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన సాయి సూర్య అవినాశ్‌ (26) అనే విద్యార్థి సోమవారం ప్రమాదవశాత్తు జలపాతంలో పడి చనిపోయాడు.

Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి
New Update

America: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన సాయి సూర్య అవినాశ్‌ (26) అనే విద్యార్థి సోమవారం ప్రమాదవశాత్తు జలపాతంలో పడి చనిపోయాడు.అవినాశ్‌ తన అక్క వద్ద ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు.

ఆదివారం సెలవు దినం కావడంతో అక్క కుటుంబంతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. ఇరు కుటుంబ సభ్యలు సమీపంలోని జలపాతానికి వెళ్లారు. అంతా సరదాగా గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ అవినాశ్ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అవినాశ్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.

కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు గద్దే శ్రీనివాస్‌, శిరీష కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి ఇలా చనిపోవడం కలచివేస్తోందని బంధువులు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. అవినాశ్ ఎంఎస్ చదివేందుకు 2023 జనవరిలో అమెరికా వెళ్లాడని చెప్పారు. కాగా నెలక్రితం ఇద్దరు తెలుగు విద్యార్థులు కూడా ప్రమాదవశాత్తూ జలపాతం నీటిలో పడిపోయారు.

Also read:  టెక్సాస్‌లో బెరిల్ హరికేన్ బీభ‌త్సం.. !

#ms #gopalapatnam #dead #student #west-godavari #america
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe