Mlc Election Results : మూడు స్థానాలు..మూడు రోజులు...విజేతలు వీరే

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముందుగా టీచర్ నియోజకవర్గ స్థానాల్లో ఫలితాలు తెలిశాయి. తెలంగాణలో నల్గొండ,- వరంగల్-,ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ గా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలిచారు.

New Update
Sripal Reddy-Malka Komaraiah- C. Anji Reddy

Sripal Reddy-Malka Komaraiah- C. Anji Reddy

Mlc Election Results : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముందుగా టీచర్ నియోజకవర్గ స్థానాల్లో ఫలితాలు తెలిశాయి. తెలంగాణలో నల్గొండ,- వరంగల్-,ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ గా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య గెలుపొందారు.  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన సొంతమైంది. 

Also Read :  ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం


మార్చి 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మార్చి 3వ తేదీ ఉదయం ప్రారంభమైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక 2 ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అదే విధంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ రోజు ముగిసింది.

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం


వీటిలో మూడు స్థానాల ఫలితాలు తేలిపోయాయి. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బీజేపీ బోణి కొట్టింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందారు. కొమురయ్యకు 12,959 ఓట్లు పోలైయ్యాయి. ఇక 12081 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కొమురయ్య అవలీలగా దాటారు.ఇక ఈ ఎన్నికల బరిలో నిలిచిన వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్‌కు 2621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు పోలైయ్యాయి. ఇక నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాలరెడ్డి విజయాన్ని అందుకొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఆయన 11, 800 ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశారు.

Also read :  సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు

 కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. మూడు రోజులపాటు సాగిన లెక్కింపు ప్రక్రియలో విజయం దోబూచులాడి చివరకు భాజపా అభ్యర్థిని వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత  భాజపా అభ్యర్థి సి.అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో నరేందర్‌రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అంజిరెడ్డి గెలుపు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఫలితాల వెల్లడింపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు కాసేపట్లో విజేతను ప్రకటించే అవకాశముంది.

Also read :  చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం

Advertisment
Advertisment
తాజా కథనాలు