KTR : నువ్వేం మంచి చేశావని మైకులో చెప్తరు..రేవంత్ పై కేటీఆర్‌ ఎద్దేవా

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శించారు . మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. నవ్వు చేసిన మంచి ఏముంది అని చెప్పాలి. చెడు గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి.

New Update
ktr vs revanth reddy

ktr vs revanth reddy

  KTR : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శించారు . మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. నవ్వు చేసిన మంచి ఏముంది అని చెప్పాలి. చెడు గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి.అదే చెడు చెవిలో చెబితే ర‌క్తం కారుత‌ది.. యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

  ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ మీటిగ్ జ‌రిగింది. ఢిల్లీ నుంచి కొత్త ఇంచార్జీ మీనాక్షికి స్వాగ‌తం ప‌లుకుతూ స‌మావేశం పెట్టారు. ఈ సందర్భంగా మూడు ఆణిముత్యాల్లాంటి మాట‌లు చూశాను రేవంత్ రెడ్డి నోటి వెంట‌ అన్నారు. రేవంత్ రెడ్డి సెల‌విస్తూ మంచి మైకుల్లో చెప్పాలి.. చెడు చెవుల్లో చెప్పాలని సూచించిండు. మంచి మైకుల్లో చెప్పుదామంటే నువ్వు చేసిన మంచి ప‌ని లేదు.  చెడు చెవుల్లో చెప్పుడు మొద‌లుపెడితే హైడ్రా నుంచి మొద‌లుపెడితే ఆర్ఆర్ ట్యాక్స్, ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్, పెద్దవాగు, మునిగిన వ‌ట్టెం పంప్ హౌజ్ గురించి చెబితే నీ చెవిలో ర‌క్తం కారుత‌ది రేవంత్ రెడ్డి… యాది పెట్టుకో. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చెప్పాన‌ని డైలాగులు కొడుతున్నాడు అని కేటీఆర్ విమ‌ర్శించారు.

ఇది కూడా చదవండి:  ఈ పండు కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది

కొత్త ఇంచార్జి మీనాక్షి గారు రైల్వే స్టేషన్ కు రాగానే కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే బ్యాగులు మోసేందుకు కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు ఉరికొచ్చార‌ని. బ్యాగులు మోసి మీ ఆత్మగౌర‌వాన్ని దెబ్బ తీసుకోవ‌ద్దని చెప్పార‌ట ఆమె. దీంతో అక్కడున్నవారంతా మీ ప‌క్కన కూర్చొన్నొడు బ్యాగులు మోసి మోసి గాడికి వ‌చ్చిండు. అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు.. ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తుండు. ఆయ‌న‌ను ప‌క్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటే ఆ మేడంకు ఏం చెప్పాలి. మీనాక్షి వాస్తవాలు తెలుసుకోవాల‌ని కోరుతున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.
 రేవంత్ రెడ్డి మాట‌లు, క‌థ‌లు చెప్పరాదు. ఆయ‌న చేసి మంచి చెప్పుకుంటే ఒడిసిపోద‌ట‌. ఈ ప‌దిహేను రోజుల కాలంలో వాట్సాప్‌లు, యూట్యూబ్‌లు చూస్తున్నాను. ఏ ఒక్క ఆడ‌బిడ్డను ప‌లుక‌రించినా రేవంత్‌ను ఏకిపారేస్తున్నారు. తెలుగు భాష‌లో ఇన్ని తిట్లు ఉంటాయ‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏం తిట్లు అవి. రోషం ఉన్నోడు అయితే పాడుబ‌డ్డ బావిలో దూకి చ‌స్తుండే. రేవంత్ రెడ్డి కాబ‌ట్టి బ్రహ్మాండంగా బ‌తికేస్తుండు. ఇంకా మంచి చేసిన అని డైలాగులు కొడుతుండు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Also Read: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!

 అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ కోసం కష్టపడి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. పెద్ద మనిషి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు తలుచుకుంటున్నారు.కల్యాణలక్ష్మి, రైతు బంధు, పెన్షన్లు టైం కు వచ్చేవి. ఏ ఒక్కరినీ కదిపిన కేసిఆర్ సంక్షేమం గుర్తొస్తుంది. కేసీఆర్ చెప్పిన టింగ్ టింగ్ అనేది రేవంత్ రెడ్డి కి నచ్చదు. అందుకే టకి టకి అన్నడు టకి లేదు టికి లేదని విమర్శించారు. 12 గంటలకు రైతు భరోసా పడుతుంది అన్నాడు. ఒక్క పైసా లేదు. లగ్న పత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అన్నాడు. ఒక గ్రాము కూడా ఇవ్వలేదన్నారు. అందర్నీ మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు.

Also Read: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

Also Read :  విద్యార్థుల మధ్య ఫేర్‌వెల్ పార్టీ చిచ్చు.. ఒకరు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు