/rtv/media/media_files/2025/06/25/ts-high-2025-06-25-10-59-42.jpg)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి. మాధవిదేవి తీర్పు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు
— The Bharat (@TheBharat_News) June 25, 2025
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని జస్టిస్ మాధవి దేవి బెంచ్ ఆదేశించింది.
ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా… pic.twitter.com/Zb5BX66I7W
ఈసీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం
అయితే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ 60 రోజుల సమయం కోరగా ఈసీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అలాగే రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం 30 రోజుల సమయం కోరగా ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించింది.
కాగా గతేడాది జనవరితో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని పలువురు మాజీ సర్పంచులు సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి.మాధవిదేవి ఇవాళ తీర్పు వెలువరించారు.
ఇక గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది.