/rtv/media/media_files/2025/05/14/kIGZ78sFDV5ZxdoVWLkJ.jpg)
TELANGANA BREAKING NEWS
మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికేనని స్పష్టం చేశారు. హైకమాంత్ తో మంత్రుల శాఖల కేటాయింపు.. మార్పుపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకూ.. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లో నో ఎంట్రీ అని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో 11 శాఖలు ఉన్నాయి. దీంతో వాటినే కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. అయితే.. ముఖ్యమైన హోం శాఖను సీఎం తనవద్దే ఉంచుకుంటారా? లేక ఎవరికైనా కేటాయిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 8న వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో మొత్తం 6 ఖాళీలు ఉండగా.. తాజా విస్తరణ తర్వాత ఆ సంఖ్య మూడుకు తగ్గింది.