Kaleshwaram Commission: విచారణకు రాను.. కాళేశ్వరం కమిషన్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్!

నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఈ నెల 5న తాను విచారణకు రాలేనని, 11న వస్తానని కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ వినతికి కమిషన్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న హరీష్ రావు విచారణ ఆధారంగా KCR తదుపరి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

New Update

కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న విచారణకు రావాలని ఇప్పటికే కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే.. ఆ రోజు తాను రాలేనని కేసీఆర్ కమిషన్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈనెల11న వస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే.. కేసీఆర్ రిక్వెస్ట్ పై కమిషన్ సైతం సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కోరినట్లుగా ఈ నెల 11న విచారణకు రావాలని తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

9న హరీష్ రావు విచారణ..

ఈ నెల 9న కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాటి మంత్రి హరీష్‌ రావు విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా విచారణ తేదీని మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. హరీష్‌ రావును కమిటీ విచారించిన తీరు.. పరిణామాల ఆధారంగా కేసీఆర్ విచారణకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అప్పటి పరిస్థితుల ఆధారంగా కేసీఆర్ విచారణకు గైర్హాజరయ్యే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం సాగుతోంది.

ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో ఇటీవల హరీష్ రావు కేసీఆర్ ను తరచుగా కలుస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే వీరు ప్రధానంగా చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ తొలి దఫా ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో కాళేశ్వరం డిజైన్ల ఖరారు, టెండర్లు, నిధుల విడుదల తదితర అంశాలపై విచారించేందుకు ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చింది కమిషన్. ఈ నెల 6న ఈటల విచారణకు హాజరుకానున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు