/rtv/media/media_files/2025/11/11/evm-2025-11-11-07-32-03.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం అయింది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. చలి చంపేస్తున్న ఓటు వేయడానికి ఉత్సహంగా వస్తున్నారు. అయితే షేక్ పేట్ డివిజన్ లో. బోరబండలో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూత్ 30లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీహాల్ లోపవర్ కట్ అయింది.. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. ఓటర్లు క్యూలైన్లోనే ఉండిపోయారు. అటు రహమత్ నగర్ లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూత్ 165, 166లో ఈవీఎంలు మొరాయించాయి. దాదాపుగా 11 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది. వాటిని ఈసీ అధికారులు రీ ప్లేస్ చేస్తున్నారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడ లోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఆమె ఓటు వేశారు సునీత. ఆమె కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకోనున్న 4,01,365 ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి నవీన్యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత,బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి పోటీలో ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విధుల్లో 5 వేల మంది సిబ్బంది ఉన్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంది. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల ఉపయోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Follow Us