భార్య రెండో పెళ్లి చేసుకుందని.. మొదటి భర్త ఏం చేశాడంటే ?

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంజలి అనే మహిళ తన మొదటిభర్తను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మొదటి భర్త.. అంజలి తమ్ముడితో కలిసి ఆమె రెండో భర్తను హత్య చేశారు. పోలీసులు అంజలిని అదుపులోకి తీసుకోగా.. నిందితులు పరారీలో ఉన్నారు.

marriage
New Update

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. గోదావరిఖని హనుమాన్ నగర్‌కు చెందిన అంజలి అనే మహిళ తన మొదటి భర్తను వదిలేసి వినయ్ అనే మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ కాలనీలో కాపురం పెట్టారు.  అయితే మొదటి భర్తతో ఉన్న సమయంలో అంజలికి ఒక పాప బాబు ఉన్నారు. ఇటీవల అంజలి మొదటి భర్తకు దగ్గరై రెండు నెలలు కలిసి ఉంది. ఆ తర్వాత తిరిగి వినయ్ వద్దకు వచ్చింది. రెండవ భర్త వినయ్‌ అడ్డు తొలగిస్తే అంజలి తనతోనే ఉంటుందని మొదటి భర్త భావించాడు.

Also Read: భార్య ప్రాణాలు తీసిన భర్త అనుమానం

అలాగే అంజలి కుటుంబ సభ్యులకు సైతం ఆమె వినయ్‌తో ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న మొదటి భర్త అంజలి తమ్ముడుతో కలిసి ఓ పథకం వేశాడు. ప్లాన్ ప్రకారం వినయ్ ఉంటున్న ఇంట్లో చొరబడి కత్తులతో అతి దారుణంగా అతడిని నరికి చంపారు. రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన వినయ్‌ని చూసి కుటుంబ సభ్యులు చలించి పోయారు.  హత్యకు కారణమైన అంజలిపై వినయ్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహంతో దాడి చేశారు. దీంతో సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంజలిని అదుపులోకి తీసుకున్నారు. వినయ్ హత్యకు కారణమైన అంజలి తమ్ముడు, మాజీ భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. దర్యాప్తు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

#murder #telangana #peddapally
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe