అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్!

మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్‌ మొయిన్‌-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర 5 మొబైల్‌ ఫోన్లు, కండోమ్‌ ప్యాకెట్‌ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించారు. 

prt
New Update

 

TG Crime: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వ్యభిచారం గుట్టు రట్టైంది. అద్దె ఇంట్లో దంపతులు నడిపిస్తున్న చీకటి దందాను గుర్తించిన పోలీసులు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరుకు చెందిన ఓ మహిళకు భారీ మొత్తంలో డబ్బులు ఆశచూపి వ్యభిచారం చేసేందుకు రప్పించగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి విటులతోపాటు దంపతులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ మేరకు మంచిర్యాల పట్టణం రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పద్మావతి కాలనీలో శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సత్తమ్మ అనే మధ్యవర్తి ద్వారా మహ్మద్‌ మొయిన్‌-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే స్థానికుల సమాచారంతో ఆ గృహంపై ఎస్‌ఐ రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి దాడి చేశారు.  ఒక్కో విటుడి నుంచి రూ. 1500 తీసుకుంటున్నట్లు గుర్తించారు. అమ్మాయిలను పంపించే సత్తమ్మకు రూ. 500, గృహం నిర్వహిస్తున్న దంపతులు రూ. 500, మిగతా రూ. 500 సదరు మహిళకు ఇస్తున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర 5 మొబైల్‌ ఫోన్లు, కండోమ్‌ ప్యాకెట్‌ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. 

#manchiryal #adilabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి