Chandra Pullareddy  : కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి జయంతి సభను విజయవంతం చేయండి.. రైతుకూలీ సంఘం కీలక పిలుపు!

భారత విప్లవోద్యమ నేత, ప్రతిఘటనోద్యమ నిర్మాత కామ్రేడ్‌ చండ్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నవంబర్‌ 9న చండ్ర పుల్లారెడ్డి 41వ వర్థంతిని నిజామాబాద్ లో నిర్వహిస్తామని తెలిపారు.

New Update
Make the birth anniversary of Comrade Chandra Pullareddy a success

Make the birth anniversary of Comrade Chandra Pullareddy a success

Chandra Pullareddy  : భారత విప్లవోద్యమ నేత, ప్రతిఘటనోద్యమ నిర్మాత కామ్రేడ్‌ చండ్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నవంబర్‌ 9న చండ్ర పుల్లారెడ్డి 41వ వర్థంతి సందర్భంగా నిజామాబాద్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తా వద్ద  ఉన్న ప్రెస్‌క్లబ్‌లో సభను నిర్వహంచనున్నామని తెలిపారు.  ఈ సందర్భంగా నవంబర్‌ 1 నుంచి 8 వరకు గ్రామాల్లో అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహించనున్నామని తెలిపారు.

1

2

3

4

ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు. పసునూరు. గ్రామం లోని దుబ్బాక సంజీవ రెడ్డి స్మారక స్తూపం వద్ద కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి  పోరెండ్ల మల్సూరు,  ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు కూలీ సంఘం  సీనియర్ నాయకులు దొంతమల్ల రాములు, జిల్లా రైతు కూలీ సంఘం ట్రెజరర్ ఎనగందుల ముత్తయ్య. జిల్లా రైతు కూలీ సంఘం  నాయకులు సముద్రాల యాదయ్య.  IFTU నాయకులు జలగం లక్మయ్య.  PDSU కన్వీనర్  మోహన్, జలగం అంజయ్య. తదితరులు పాల్గొన్నారు  అనంతరం  గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ  అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించారు.

Advertisment
తాజా కథనాలు