KTR :  రూ.3 కోట్లకు గ్రూప్‌ - 1 ఉద్యోగాలు అమ్మారు.. కేటీఆర్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి...ఢిల్లీకి పంపించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అన్నారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు..ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు.

New Update
KTR

KTR

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి...ఢిల్లీకి పంపించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అన్నారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు..ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు. ప్రతి కంపెనీని ముడుపుల కోసం వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. L&T కంపెనీని ముడుపుల కోసం వేధించడం వల్లే..హైదరాబాద్‌ మెట్రోను వదిలేసి వెళ్లిపోతామంటున్నారని కేటీఆర్ చెప్పారు. గతంలో  L&T మెట్రో CFOను అరెస్ట్ చేస్తామని రేవంత్ బెదిరించారని ఆరోపణలు గుప్పించారు. 

రేవంత్ రెడ్డి పాలన నియంత పాలనను తలపిస్తుందన్న కేటీఆర్..  ఒక్కరోజు కూడా సీఎం రేవంత్ సచివాలయానికి రావట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాలేజీలు బంద్‌, ఆరోగ్య శ్రీ సేవల రద్దు, యూరియ కొరత ఉందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, రేషన్ డీలర్ల ఆందోళన చేపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఫైరయ్యారు. RRR అలైన్‌మెంట్‌ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామని,  కానీ రేవంత్ సర్కార్ పూర్తిగా అలైన్‌మెంట్ సొంత ప్రయోజనాల కోసం మార్చుతోందన్నారు. దీంతో అనేక మంది రైతుల భూములు కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 12 వేల కోట్ల డ్రగ్స్ దొరికితే సీఎంకు కనీసం సమాచారం లేదన్నారు కేటీఆర్. 

రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకోకు

రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకోకు..పతనం తప్పదని హెచ్చరించారు కేటీఆర్. గ్రూప్‌ - 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టు గుర్తించిందని, రూ.3 కోట్లకు గ్రూప్‌ - 1 ఉద్యోగాలు అమ్మారని అభ్యర్థులే చెబుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే బీజేపీ మౌనంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని తెలిపారు. కనీసం గ్రూప్‌ వన్ అభ్యర్థులు, విద్యార్థులు రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు కేటీఆర్.  

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టే హక్కుంది. ఎవరైనా పార్టీ పెట్టినా స్వాగతిస్తామని చెప్పారు. కొత్తగా పార్టీలు పెట్టుకుని ఎవరైనా తమ విధానాలను చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లవచ్చు అని అన్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో ఎలుకలమాదిరి మారిందని కేటీఆర్ తెలిపారు. మా పార్టీ నుంచి చేరిన నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కొట్లాడిన ప్రతి ఒక్కరు… ఆ పార్టీ నియోజకవర్గాల్లో దారుణంగా మోసపోయారని అన్నారు. నిజంగా రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు