/rtv/media/media_files/2024/11/25/zc9jz0XKAo2kIe2ulc7a.jpg)
Ramachandra Reddy: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోనో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. సిద్దిపేట జిల్లా కొండపాక సొంత ఊరు. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.
సిద్ధిపేట నుంచి కేసీఆర్...!
కాగా 1985లో సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి తెలుగు దేశం పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఈయన మంచి మిత్రుడు.. అలాగే రాజకీయ సమకాలికులు. ఆ కాలంలో కేసీఆర్ సిద్ధిపేట నియోజకవర్గం నుంచి... రామచంద్రారెడ్డి దుబ్బాక నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ని బలపరిచిన నాయకులుగా వీరు ఉన్నారు. తాజాగా ఆయన మరణవార్త తెలుసుకున్న నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.