/rtv/media/media_files/2025/09/04/kavitha-2025-09-04-17-45-07.jpg)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాలో.. వద్దో.. బీసీలు ఆలోచించుకోవాలన్నారు. పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారా? అని ప్రశ్నించారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని.. ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశముందని ఈ సందర్భంగా కవిత తెలిపారు.
‘‘మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం అంత యాక్టివ్గా లేదు. ఆ పార్టీ నేతలెవరూ క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా లేరు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదు? అలా ప్రచారం చేయడం లేదంటే.. వారు రాష్ట్రస్థాయి నేతలు కారా?. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఆ సామాజిక వర్గానికి వారు అనుకూలమా?, లేదా? అనేది వెల్లడించాలి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తుంది? బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలి. సబ్ప్లాన్కు నిధులు కేటాయించాలి. సీఎం రేవంత్ ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. నేను అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారు. ఎవరు సమాధానాలు దాటవేస్తున్నారో వారు గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు’’ అని కవిత అన్నారు.
Follow Us