Yoga Day 2025: యోగా డే సెలబ్రేషన్స్.. LB స్టేడియానికి త‌ర‌లివ‌చ్చిన సినీతార‌లు

HYDలోని LB స్టేడియంలో నిర్వ‌హించిన యోగా డే కౌంట్‌డౌన్ కార్యక్రమం ఇవాళ సందడిగా జరిగింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతితోపాటు సినీతారలు తేజ స‌జ్జా, సాయిధ‌ర‌మ్ తేజ్, మీనాక్షి చౌద‌రి హాజరయ్యారు.

New Update
International Yoga Day 2025

International Yoga Day 2025

జూన్ 21 అంత‌ర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా యోగా డే కౌంట్‌డౌన్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

International Yoga Day 2025

ఈ యోగా డే సెలబ్రేషన్స్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వీరితోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు భారీ సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. అలాగే మరోవైపు ఈ కార్యక్రమానికి సినీ తారలు కూడా హాజరయ్యారు. 

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా,  ఖుష్బూ, మీనాక్షి చౌదరి సహా మరెందరో సినీ నటీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కళ తీసుకొచ్చారు. అందరితోపాటే కూర్చుని యోగాసనాలు వేశారు. అంతేకాకుండా తమ అద్భుతమైన ప్రసంగంతో అందరిలోనూ ఉత్తేజం నింపారు. ఇలా విద్యార్థులు, యోగా బోధకులు, అభ్యాసకులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిపుణులు సహా వివిధ రంగాల నుండి 40,000+ మందికి పైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు