Hyderabad: హర్షసాయి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు

యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి హర్ష తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈమె స్టేట్‌మెంట్‌ను నార్సింగ్ పోలీసులు ఈరోజు రికార్డ్ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update

Harsha Sai Case: 

హర్షసాయి కేసులో నార్సింగి పోలీసులు ఇవాళ మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. దీంట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. మెగా సినిమా పేటెంట్‌ రైట్స్‌ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని బాధితురాలు చెప్పింది. మూవీ స్క్రిప్ట్‌ డిస్కషన్‌ కోసం పిలిచి... కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చి తర్వాత అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపణ చేసింది. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె పోలీఉలు ఫిర్యాదు ఇచ్చింది. మరోవైపు రెండు రోజుల క్రితమే బాధితురాలికి మెడికల్ టెస్టులు పూర్తి చేశారు పోలీసులు. ప్రస్తుతం వాటి తాలూకా రిపోర్ట్స్ నార్సింగి పోలీసుల దగ్గర ఉన్నాయి. 

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన హర్ష పేదలకు సహాయం చేస్తుంటాడు. అయితే ఇతనిపై నార్సింగ్ పోలీసు స్టేషన్‌‌లో కేసు నమోదు అవడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా యువతి కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ.2 కోట్లు తీసుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

Also Read: USA: అమెరికాలోని ఫ్లోరిడాను ముంచేస్తున్న హరికేన్

Advertisment
Advertisment
తాజా కథనాలు