TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకు తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు అల్లు అర్జున్ ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ అభివాదం చేస్తూ వెళ్ళారు...దానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకే తెలుసునని వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 21 Dec 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీ పెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కదా అనేది ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఎం మానవీయ కోణాన్ని మర్చిపోయారని అల్లు అర్జున్ వాఖ్యలు చేశారు. కానీ చనిపోయిన సోదరి కుటుంబాన్ని పరామర్శించాలని ఆయన అనుకోలేదు. వారిని అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళి కలిసి ఉంటే బావుండేదని తన అభిప్రాయమని శ్రీధర్ బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రోడ్ షో చేశారా లేదా అనేది వీడియోలు చూస్తే తెలుస్తుంది కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అల్లు అర్జున్ ఏం అన్నారు? రేవతి, శ్రీ తేజ్ కుటుంబానికి సారీ చెప్పారు. ఆ కుటుంబానికి జరిగింది చాలా బాధకరమన్నారు. థియేటర్ కు వచ్చిన వారిని నవ్వుతూ పంపించాలని కోరుకునే మనిషిని. థియేటర్ లో ప్రమాదం జరిగిందంటే నాకంటే బాధపడేవారు ఎవరు లేరన్నారు. శ్రీ తేజ్ కోలుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ మద్ధతుగా నిలిచినందుకు థాంక్స్. 20 ఏళ్లుగా నేను ఇలా చేశానా? నా గురించి మొత్తం తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ ను బ్యాడ్ గా క్రియేట్ చేస్తున్నారు. 30 ఏళ్లుగా సంధ్య థియేటర్ వెళ్తున్నాను. నేను పర్మిషన్ లేకుండా వెళ్లానని చెప్పడం బాధకరం. నన్ను పోలీసులు కలవలేదు.. అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తర్వాతే నేను థియేటర్ వెళ్లాను. రోడ్ షో చేయలేదు. థియేటర్ దగ్గర కారు ఆగిపోగానే జనం పరిగెత్తుకొచ్చారు. నెమ్మదిగా ముందుకు వెళ్లండని చెప్పాను. కానీ రెచ్చగొట్టలేదు. డిస్ట్రబ్ చేయాలని చేయలేదు. నన్ను పోలీసులు కలవలేదు. జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయా. నా పిల్లలు నా పక్కనే ఉన్నారు. అలాంటిది నా అభిమాని చనిపోయారని తెలిస్తే తట్టుకుంటానా అని బన్నీ బాధా మాట్లాడారు. చాలా బాధేస్తుంది.. ఘటన జరిగిన తర్వాత ఏం చేయాలో తెలీక వీడియో పెట్టా. ఆ వీడియో కూడా డబ్బు కోసమని కాకుండా వాళ్ళ కోసం నేనున్నానని చెప్పడానికే. ఇలా జరిగిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అన్ని క్యానిల్ చేశాం. లీగల్ గా నేను వెళ్ళలేనని, బాబు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు స్పెషల్ పర్మిషన్ తో మా నాన్నను హాస్పిటల్ కి పంపాను. ఆ తర్వాత సుకుమార్ ను పంపించా. అలాంటిది నేను అసలు కేర్ చేయడం లేదని, నాపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. మీరు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలని నేను సినిమాలు చేస్తున్నా. గర్వపడేలా సినిమా చేశానని అనుకునుకుంటే, మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం..' అంటూ చెప్పుకొచ్చాడు. Also Read: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి