/rtv/media/media_files/2024/12/17/1TV3pFDnxc6hlJ4bKwIV.jpg)
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో విపరీతంగా గాయపడిన శ్రీతేజ్ చావు బుతుకుల మధ్య పోరాడుతున్నాడు. దాదాపు పదిరోజులుగ ఈపిల్లాడు ఆసపత్రిలనే ఉన్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొంత సేపటి క్రితం కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు.
ఏం చెప్పలేం..
వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని చెప్పారు. అతని జ్వరం పెరుగుతోందని కానీ మినిమం ఐనోట్రోప్స్లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఫీడ్లను బాగానే తట్టుకుంటున్నాడు కానీ దీని బట్టి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాని మాత్రం చెప్పలేమని అంటున్నారు. ఎప్పుడు ఏమవుతోందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని కిమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీతేజ్కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని కిమ్స వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇలా ఎంత కాలం ఉండాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి
— Tharun Reddy (@Tarunkethireddy) December 17, 2024
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన KIMS ఆసుపత్రి
వెంటిలేటర్ పై శ్రీ తేజ్ కు కృత్రిమ శ్వాస అందిస్తున్న వైద్యులు pic.twitter.com/7rBzuy44G4
Also Read: NEET: 2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు..ఈసారైనా సవ్యంగా జరిగేనా..