/rtv/media/media_files/2025/03/03/e5zO6W1kTvFdwwwiBJHj.jpg)
Hyderabad hit and run case
Hyderabad: ఈమధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటే.. మరికొంతమంది అతివేగంతో అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. వారి నిర్లక్ష్యం ఒక కుటుంబం రోడ్డున పడడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే హైదరాబాద్ నార్సింగ్ లో చోటుచేసుకుంది. కారు డ్రైవర్ అతివేగం ఓ యువకుడి నూరేళ్ళ భవిష్యత్తును చిదిమేసింది.
నార్సింగీ లో మరో హిట్ అండ్ రన్ కేసు.
— Telangana Awaaz (@telanganaawaaz) March 3, 2025
నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.
స్పాట్ లో ప్రాణాలు విడిచిన యువకుడు కొవూరి శ్రీనివాస్.
పొట్ట చేత పట్టుకొని కుటుంబం తో హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్.
రాత్రి ఇంటికి వెళుతుండగా ప్రమాదం. సిసి టివి కెమరాలో… pic.twitter.com/vKERuaLLo1
కారుతో ఢీకొట్టి..
శ్రీనివాస్ అనే యువకుడు పొట్ట కూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వచ్చాడు. అయితే నిన్న రాత్రి శ్రీనివాస్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. అటుగా వచ్చిన టాటా హారీయర్ కారు అతివేగంతో అతడి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన కారు ఆపకుండా పరారయ్యాడు డ్రైవర్. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో.. నార్సింగ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన శ్రీనివాస్ ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కావున రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి.
Also Read: Oscar Awards 2025: ప్రియాంక చోప్రాకు ఆస్కార్ జస్ట్ మిస్.. 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!