Hyderabad: అశోక్‌నర్‌‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు

అశోక్‌నగర్‌లో కొద్దిసేపటి క్రితం గ్రూప్స్‌ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update

Group 1 Candidates Protest: 

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌‌లో గ్రూప్స్ అభ్యర్ధులు హఠాత్తుగా ఆందోళన చేశారు. సడెన్‌గా రోడ్లమీదకు వచ్చి ప్లకార్డులు, కొవ్వొత్తులతో నిరసనలు చేశారు. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఇంతకు ముందు జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో తప్పులు, జీవో 29ను సవరించిన తర్వాతే ఇప్పటి పరీక్షలు నిర్వహించాలంటూ ఆందోళన చేశారు.  సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10మందిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అశోక్‌ నగర్‌‌లో ఉద్రిక్తత తగ్గలేదు. 

Also Read: శబరిమలకు రోజుకు 10వేల స్పాట్ బుకింగ్స్..తగ్గిన వర్చువల్ బుకింగ్స్

తెలంగాణలోని గ్రూప్ - 1 అభ్యర్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల పై ధర్మసనం విచారణ చేపట్టింది. ఆ రెండు పిటిషన్లను కొట్టేసింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో తమ ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

హాల్ టికెట్స్ విడుదల....

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

Also Read: National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం

ఈ నెల 21 నుంచి...

వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు.

Also Read: AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు

 

 

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు