Kerala: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్..10వేల స్పాట్ బుకింగ్స్ ఓపెన్

శబరిమల భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10వేల స్పాట్ బుకింగ్స్‌ ను ఓపెన్ చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ లేకుండా శబరిమల దర్శించుకునే యాత్రికులకు ప్రభుత్వం సజావుగా ప్రవేశం కల్పిస్తుందని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

author-image
By Manogna alamuru
New Update
Sabarimala :  సరికొత్త రికార్డ్...రూ. 200కోట్లు దాటిన శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం..!!

Sabarimala Spot Bookings: 

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని శబరిమల యాత్రికుల దర్శనం సజావుగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరి విజయన్ ప్రకటించారు. శబరిమల మండల-మకర యాత్రను సులభతరం చేసే చర్యలపై చర్చించేందుకు విజయన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను అనుమతించేలా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. కేరళ ప్రభుత్వం యాత్రికులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే దర్శనం కల్పిస్తుందని పేర్కొంది. స్పాట్ బుకింగ్ సౌకర్యాలను ముగించింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున నిరసనకు దారితీయడంతో..దానిని సవరించి 10వేల మందికి స్పాట్ బుకింగ్ ఇవ్వాలని నిర్ణయించింది . దీంతో స్పాట్ బుకింగ్స్‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా శబరిమల దర్శనం చేసుకునే వారికి కూడా అయ్యప్ప ఆలయంలో దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. వర్చువల్ క్యూను కూడా పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Also Read: National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం

గతంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్పాట్ బుకింగ్‌ను తొలగించాలన్న అసలు నిర్ణయాన్ని దేవస్వం బోర్డు సమర్థించింది. అయితే, ప్రముఖ రచయిత టి. పద్మనాభన్‌తో సహా విమర్శకులు ఈ వాదనను నిరాధారమైనదని ఖండించారు. ఆధునిక వ్యవస్థలు ఎంట్రీ పాయింట్ల వద్ద వ్యక్తిగత సమాచారాన్ని రికార్డ్ చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో సందర్శకులను సులభంగా నిర్వహించగలవని వాదించారు. పద్మనాభన్, ఇతర సామాజిక, మత పెద్దలతో పాటు కేరళ కౌముది లాంటి మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ వ్యతిరేకతను వినిపించారు. చర్చను మరింత తీవ్రతరం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తిప్పికొట్టడాన్ని చాలా మంది స్వాగతించారు.

 

Also Read: AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు