కార్పోరేటర్ కాదు కామాంధుడు..  ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన సబిత అనుచరుడు!

మాజీ మంత్రి సబిత అనుచరుడు పూర్ణేశ్వర్ రెడ్డి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమ పేరుతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడని, పెళ్లి అంటే కులం వేరే అని దూరం పెట్టాడని యువతి తెలిపింది. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో పోలీసులను సంప్రదించింది.

New Update
Purnsewar reddy

Purnsewar reddy Photograph: (Purnsewar reddy)

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి సబిత అనుచరుడు పూర్ణేశ్వర్ రెడ్డి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో కులాలు వేరని దూరం పెట్టాడని ఆ యువతి ఆరోపించింది. ప్రేమిస్తున్నానని ఆ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడని పూర్ణేశ్వర్‌ రెడ్డిపై పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. 36వ డివిజన్‌ కార్పోరేటర్ పూర్ణేశ్వర్ ఇంటి ఎదుట యువతి ధర్నా చేస్తోంది. యువతి ఫిర్యాదుతో ఎస్సీ,ఎస్టీ పోక్సో సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు