Keerthi Richmond Villas: రూ.2 కోట్లు పలికిన రిచ్‌మండ్ విల్లాస్‌ లడ్డూ.. ఆ డబ్బులను ఏం చేస్తారో తెలుసా?

హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్.

New Update
keerthy

హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్. ఇది బాలాపూర్ లడ్డూకు పోటీగా నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.ఈ సారి ఈ గణేష్ లడ్డూ ధర ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. ఆక్షన్ లో వచ్చిన మొత్తాన్ని ఆర్‌వి దియా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్జీఓలకు లకు ఆర్థికసాయం చేస్తారు. ఈ సంస్థలు వృద్ధాప్య సంరక్షణ, మహిళా సంక్షేమం నుండి విద్య, పోషకాహారం, వైద్య సహాయం, జంతు సంక్షేమం వరకు పనిచేస్తాయి.  

లిస్టు ఇదే 

2018: వేలంపాట రూ. 25,000తో ప్రారంభమైంది. 
2019: రూ. 18.75 లక్షలకు అమ్ముడైంది. 
2020: రూ. 27.3 లక్షలకు అమ్ముడైంది.
2021: రూ. 41 లక్షలకు అమ్ముడైంది.
2022: రూ. 60 లక్షలకు అమ్ముడైంది.
2023: రూ. 1.26 కోట్లకు అమ్ముడైంది.
2024: రూ. 1.87 కోట్లకు అమ్ముడైంది. ఈ లడ్డూను 25 మంది సభ్యుల గ్రూప్ వేలంలో దక్కించుకుంది.
2025: రూ. 2.32 కోట్లకు అమ్ముడై, సరికొత్త రికార్డును సృష్టించింది. 
ఈ వేలంలో 80 మంది విల్లా యజమానులు నాలుగు గ్రూపులుగా విడిపోయి పాల్గొన్నారని సమాచారం.

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులను పేద పిల్లల చదువు, హాస్టల్ విద్యార్థులకు సహాయం వంటి వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం కేవలం ఒక వేడుకగా కాకుండా, సామాజిక సేవకు ఒక మార్గంగా కూడా మారింది. 

Advertisment
తాజా కథనాలు