/rtv/media/media_files/2025/10/21/a-car-crushed-a-two-year-old-boy-2025-10-21-17-14-33.jpg)
A car crushed a two-year-old boy
CRIME: మణికొండ మున్సిపాలిటీ పుప్పాల గూడ అల్కాపురి టౌన్షిప్లో కారు బీభత్సం సృష్టించింది. బైక్ను బలంగా ఢీ కొనడంతో బైక్ పై వెళుతున్న తండ్రీ కొడుకులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తన రెండేళ్ల కుమారుడు కుషన్తో కలిసి దీపావళి షాపింగ్ కోసం నవీన్ కుమార్ అనే వ్యక్తి ఖాజాగూడ వెళ్లాడు. షాపింగ్ ముగించుకని బైక్ పై తిరిగి వస్తుండగా అతివేగంగా వచ్చిన టాటా నెక్సాన్ కారు వీరి బైక్ ను బలంగా ఢీ కొట్టింది.దీంతో బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు నవీన్ కుమార్, కుశల్ జోయల్ గాల్లో ఎగిరి కిందపడ్డారు. బాలుడు కుశల్ జోయల్ పై నుంచి కారు దూసుకెళ్లగా.. తండ్రి నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
కాగా చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఒడిలోనే కుశల్ జోయల్ ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తండ్రికొడుకులు దీపావళి పండుగ సందర్భంగా టపాసుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. తన ఒడిలోనే కన్న కొడుకు ప్రాణాలు విడవడంతో నవీన్ కుమార్ గుండెలవిసేలా రోదించాడు. బాణా సంచా తెచ్చుకుందామని వెళ్తే.. కారు మృత్యువు రూపంలో వచ్చి కబలించడంతో కుశల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కన్న కొడుకు కళ్లముందే మరణించడంతో ఆ తండ్రి రోదనకు అంతు లేకుండా పోయింది.
Also Read : దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!
Follow Us