/rtv/media/media_files/a9GGDm8pCcfZgNfOxBA3.jpg)
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.826 కోట్లతో ఆరు జంక్షన్లు అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే ఆరు జంక్షన్లకు సంబంధించి అభివృద్ధి నమూనా వీడియోలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. HCITI ప్రాజెక్టులో భాగంగా వీటిని రెండు ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయనుంది. మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ను అభివృద్ధి చేయనున్నారు. ఇక రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో రోడ్ నెం.45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ అలాగే క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేశారు.
Also Read: హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్మీట్