Delhi : నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!

TG: ఈరోజు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత 3 రోజుల పాటు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.

New Update
Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..

Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని 3 రోజుల పాటు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కాగా రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకొని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది.

Also Read :  సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

ఎవరికీ ఏ పదవులు!

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న రాష్ట్ర కేబినెట్ మాత్రం ఇంకా భర్తీ కాలేదు. ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి వర్గంలో ముఖ్యమైన విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేడు. దీనిపై పలుమార్లు ప్రతిపక్షాలు బీజేపీ ,  బీఆర్ఎస్ విమర్శలు చేసిన.. చేస్తున్న కాంగ్రెస్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు  సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తానే మిగిలిన శాఖలకు మంత్రిని అని ఓ మీడియా సమావేశంలో బహిరంగ ప్రకటన చేశారు. కాగా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న ఇంకా నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గం విస్తరణ కాకపోవడం అనేక చర్చలకు దారి తీస్తోంది.

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

ఈనాడు కోసం ఆనాడు..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తమ ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్న నేతలు, పార్టీ కోసం పని చేసిన నేతలు.. ఇలా అందరి చూపు నామినేటెడ్ పోస్టులపై ఉంది. మరోవైపు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి కూర్చుకోసం హస్తినలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణపై ఎల్లుండి జరిగే సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు