Jubilee Hills By-Election : EVM తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ ముందంజ !

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఈవీఎం తొలి రౌండ్ లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. షేక్ పేట్ డివిజన్ లో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది.

New Update
naveen yadav

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఈవీఎం తొలి రౌండ్ లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62  ఓట్ల అధిక్యంలో ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్‌ కు  8926 ఓట్లు పోల్ అవ్వగా..  బీఆర్ఎస్ కు 8864 ఓట్లు పోల్ అయ్యాయి.  షేక్ పేట్ డివిజన్ లో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది. ఇక్కడ ముస్లిం ఓట్లు చాలా ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో కాంగ్రెస్ కు 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10గా ఉన్నాయి.తుది ఫలితం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.

186 మంది సిబ్బంది

కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.

 అప్‌‌డేట్స్‌‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్‌‌ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు