/rtv/media/media_files/2024/10/29/cyw2ia9cFBGjgknv6WVk.jpg)
CM Revanth Reddy: దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వారికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోందని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తామన్నారు. అంబేడ్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించినట్లు చెప్పారు.
Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!
కఠినంగా వ్యవహరించాలి...
ఒకనాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి ఉండేది అని అన్నారు. కానీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో దాదాపు15 వేల నియామక పత్రాలు అందించామన్నారు. పీజీలు, పీహెచ్డీలు చదువుకున్నవారు కూడా పోలీస్ శాఖలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరారు.
Also Read: నిఖేశ్కుమార్ ఫ్రెండ్ లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని అన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ లోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రగ్స్ , గంజాయి లాంటివి కనిపించొద్దని చెప్పారు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.
డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరారు. ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రాన్స్ జెండర్స్ పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు. అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
హోంగార్డులపై వరాల జల్లు...
డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే...ఈ సందర్బంగా వారికి ఒక శుభవార్త చెబుతున్నామన్నారు సీఎం. హోమ్ గార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే హోమ్ గార్డ్స్ వీక్లి పరేడ్ అలవెన్స్ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నామన్నారు. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, యాక్సిడెంట్ అయ్యి మరణించినా రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేయనున్నట్లు చెప్పారు.