Rape : కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం..నిందితుడి అరెస్ట్‌!

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

author-image
By Bhavana
rape
New Update

Hyderabad : హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళ పై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కూకట్‌ పల్లి పోలీసులు వివరించారు. నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జులై 3న కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం చేసినందుకు కండక్టర్‌ ని  అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణను నాచారం సమీపంలో పట్టుకున్నారు. ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో కృష్ణ బాధితురాలితో సంభాషణలు జరిపి అత్యాచారం చేశాడు.

తాజా సంఘటనలో, కూకట్‌పల్లి నుండి తన స్వస్థలమైన ఏపీలోని సామర్లకోటకు వెళ్లేందుకు సాయి కుమార్ బస్సు (AP07 TT 6633) ఎక్కుతుండగా బాధితురాలు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుందని బాధితురాలిని మరో సీటులోకి మారమని చెప్పాడు. వాటర్ బాటిల్ ఇచ్చి ఆమెతో మాట్లాడసాగాడు. అనంతరం ఆమె  మూతి బిగించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సాయి కుమార్ బాధితురాలిని బెదిరించి, రెండోసారి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు స్టాప్‌లో ఆగిన బాధితురాలు బస్సు దిగి ట్రావెల్‌ కంపెనీ యజమాని అనిల్‌రెడ్డికి ఫోన్‌  చేసి విషయాన్ని తెలియజేసింది. 

అనిల్ రెడ్డి బాధితురాలితో కలిసి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లి పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసి కేసు నమోదు చేసి (1215 ఆఫ్ 2024) సాయికుమార్‌ను అరెస్టు చేశారు.

Also Read :  తిరుమల ప్రసాదం గురించి ..సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి!

#rtc-bus #rape
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి