Rape : కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం..నిందితుడి అరెస్ట్‌!

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

author-image
By Bhavana
New Update
rape

Hyderabad : హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళ పై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కూకట్‌ పల్లి పోలీసులు వివరించారు. నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జులై 3న కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం చేసినందుకు కండక్టర్‌ ని  అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణను నాచారం సమీపంలో పట్టుకున్నారు. ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో కృష్ణ బాధితురాలితో సంభాషణలు జరిపి అత్యాచారం చేశాడు.

తాజా సంఘటనలో, కూకట్‌పల్లి నుండి తన స్వస్థలమైన ఏపీలోని సామర్లకోటకు వెళ్లేందుకు సాయి కుమార్ బస్సు (AP07 TT 6633) ఎక్కుతుండగా బాధితురాలు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుందని బాధితురాలిని మరో సీటులోకి మారమని చెప్పాడు. వాటర్ బాటిల్ ఇచ్చి ఆమెతో మాట్లాడసాగాడు. అనంతరం ఆమె  మూతి బిగించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సాయి కుమార్ బాధితురాలిని బెదిరించి, రెండోసారి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు స్టాప్‌లో ఆగిన బాధితురాలు బస్సు దిగి ట్రావెల్‌ కంపెనీ యజమాని అనిల్‌రెడ్డికి ఫోన్‌  చేసి విషయాన్ని తెలియజేసింది. 

అనిల్ రెడ్డి బాధితురాలితో కలిసి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లి పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసి కేసు నమోదు చేసి (1215 ఆఫ్ 2024) సాయికుమార్‌ను అరెస్టు చేశారు.

Also Read :  తిరుమల ప్రసాదం గురించి ..సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: బాచుపల్లి సూట్‌కేస్ హత్య మిస్టరీ.. నాలుగు ప్రత్యేక బృందాలతో..!!

బాచుపల్లిలో ఓ సూట్‌కేస్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మృతదేహం పాడైపోయిన స్థితిలో ఉండటంతో.. దానికి గల ఆధారాలు గుర్తించలేక పోతున్నారు. శవం మెడ చుట్టూ గాయాలు, వైర్ బిగించి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update

Crime News: బాచుపల్లి ప్రాంతంలో ఓ సూట్‌కేస్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్య కేసు ప్రస్తుతం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మృతదేహం పాడైపోయిన స్థితిలో ఉండటంతో.. దానికి గల ఆధారాలు గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత శవాన్ని బయటకు తీసి పరిశీలించగా.. ఆమె మెడ చుట్టూ గాయాలున్నట్టు కనిపించింది. దీనితో వైర్ బిగించి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనాథ శవంగా ఉన్న .. 

పోలీసులు ప్రాథమికంగా మృతురాలి శరీరంపై ఉన్న దుస్తులు, చేతిలోని మట్టి గాజుల ఆధారంగా ఆమె నార్త్ ఇండియాకు చెందినవారి కావచ్చని భావిస్తున్నారు. మృతురాలిని ఇప్పటివరకు ఎవరూ గుర్తించకపోవడం, ఆమెకు సంబంధించి ఫిర్యాదు రావకపోవడంతో, మృతదేహం బయటపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం విచారణను మరింత సంక్లిష్టం చేసింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. బాచుపల్లి, బొల్లారం, దుండిగల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అక్కడి రహదారులపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను ఖంగుతీరిగ పరిశీలిస్తున్నారు. మృతురాలి వివరాలను గుర్తించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. వెంటనే వాటిని తినడం ప్రారంభించండి!

ఘటనాస్థలాన్ని పరిశీలించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్.. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ హత్యగా అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని గుర్తించడానికి, హత్య వెనుక ఉన్న కారణాలను వెలికితీయడానికి, ఆధారాలు సేకరించడానికి ప్రత్యేకమైన బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. పోలీసుల అంచనాల ప్రకారం.. మృతురాలి హత్య జరిగి కనీసం మూడు రోజులైనా ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని బయటపడకుండా కప్పిపుచ్చే ఉద్దేశంతో సూట్‌కేస్‌లో పెట్టి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు హైదరాబాద్ నగరంలోని మోస్ట్ మిస్టీరియస్ క్రైమ్‌గా మారింది. ఆధారాలు లేని ఈ హత్యను ఛేదించేందుకు పోలీసులు కొత్త కోణాలను విశ్లేషిస్తున్నారు. ప్రజలు ఎవరైనా ఆమె గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలంటూ కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం

( ts-crime | ts-crime-news | Latest News | telugu-news | crime news)

Advertisment
Advertisment