తెలంగాణలో కాంగ్రెస్ నేతల కొట్లాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఒకరినొకరు చేయిచేసుకున్నట్లుగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్యలకు అసలు పడటంలేదు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Susheela Reddy BRS (@susheela353) April 30, 2025
మంత్రి గారి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపీ
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కొట్టిన ఎంపీ మల్లు రవి, తిరిగి ఎంపీ మీద దాడి చేసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల… pic.twitter.com/T3e2TGA2IL
ఈ క్రమంలో జిల్లాలో అధికారులు కూడా సరితా తిరుపతయ్యకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారట. దీంతో జిల్లాలో బండ్ల వర్సెస్ సరితా తిరుపతయ్యగా రాజకీయం మారింది. జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోవడంతో ఆయన కూడా చేతులేత్తేశారట. సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకు రాకుండా, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే తన ముందే ఎంపీ మల్లు రవి ఆమెను వేదికపైకి పిలువడం ఈ కొట్లాటకు దారి తీసిందట.
భూభారతి అవగాహన కార్యక్రమంలో
తాజాగా జరిగిన భూభారతి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్లతో పాటుగా తిరుపతయ్యను కూడా ఎంపీ మల్లు రవి వేదిక మీదకు పిలిచారు. అయితే తనకంటే ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నచ్చని ఎమ్మెల్యే బండ్ల కార్యక్రమం అయిపోయాక ఎంపీ మల్లు రవిని నిలదీశారట. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాదులాట జరిగిందని.. దీంతో సహానం కోల్పోయిన ఎంపీ మల్లు రవి.. ఎమ్మెల్యే బండ్లను చెంపమీద గట్టిగా కొట్టారని సమాచారం. దీంతో షాక్ కు గురైన ఎమ్మెల్యే బండ్ల తాను కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా తిరిగి ఎంపీని కొట్టినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఊహంచని పరిణామంతో షాక్ అయిన మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చోగా మౌనంగా ఉండిపోయాడు కానీ ఆపే ప్రయత్నం చేయలేదట. అయితే దీనిపై ఎంపీ,ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.