TG News: చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

వనపర్తి జిల్లాలోని కొత్తపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. హై స్పీడ్‌ కారణంగా అదుపుతప్పిన కారు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

author-image
By Kusuma
accident
New Update

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాలోని కొత్తపేటలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో వెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. చెట్ల పొదల్లో ఇరుక్కున్న కారును వేరే వాహనం ద్వారా పోలీసులు బయటకు తీశారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో మరో ప్రమాదం

ఈరోజు ఉదయం హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర కూడా ఘోర ప్రమాదం జరిగింది. స్పీడ్‌గా వెళ్తున్న కారు పెద్ద అంబర్‌పేట దగ్గర డివైడర్‌ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంలో ఓ పసిపాప కూడా ఉంది. చనిపోయిన మహిళ కూతురే ఈ చిన్నారి. నల్లగొండ నుంచి ECIL వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 


#mahabubnagar #accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి