/rtv/media/media_files/2025/04/22/yrNw8GH3x7pPt0Um3m9k.jpg)
BRS MLA Meets HYDRAA Chief
హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జై కొట్టారు. నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు. తన నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి నల్ల చెరువును పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో మిగిలిన చెరువులను కూడా అభివృద్ధి చేయాలని మంగళవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారిని కలిసి వినతి పత్రం అందించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న భూ యజమానులతో పాటు ప్లాట్లు ఉన్నవారికి టీడీఆర్ కింద తగిన నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు. నకిలీలకు ఆస్కారం లేకుండా అసలు లబ్ధిదారులను గుర్తించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
చెరువుల అభివృద్ధి.. అభినందనీయం
— HYDRAA (@Comm_HYDRAA) April 22, 2025
-హైడ్రా కమిషనర్ను కలిసిన కూకట్పల్లి ఎమ్మెల్యే
నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు అభినందించారు. తన నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి నల్లచెరువును పైలట్… pic.twitter.com/jUtDl0Untj
నాలాలను డైవర్ట్ చేయండి..
అభివృద్ధి చేసిన చెరువుల్లో మురుగు నీరు కలవకుండా నాలాలను డైవర్ట్ చేయాలని సూచించారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా.. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐడీఎల్ చెరువు, బోయిన చెరువును, ములకత్వ చెరువు నల్ల చెరువులో కొంత భాగం సుందరీకరణ చేశామన్నారు. కోర్టు కేసులుండడంతో పనులు పూర్తి చేయలేకపోయామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి వారికి నష్ట పరిహారం అందేలా చూస్తామని.. అలాగే నగరంలోని అన్ని చెరువుల అభివృద్ధి పనులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు.
(telugu-news | telugu breaking news)