/rtv/media/media_files/2026/02/14/fotojet-8-2026-02-14-18-15-45.jpg)
vaddepalli muncipality
BIG BREAKING : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆదిలోనే బిగ్ షాక్ తగలనుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన 8మంది ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ కౌన్సెలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని కవిత చెప్తున్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సత్తా చాటింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 10 వార్డులకు గాను ఏకంగా 8 వార్డులు కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకే మున్సిపల్ చైర్మన్ సీటు ఖరారైంది. అయితే ఇపుడు వీరంతా కవితకు షాక్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో వారంతా కాంగ్రెస్ లో చేరనున్నారు.
ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలోవారంతా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 వార్డులు గెలిచిన 'సింహం' గుర్తు అభ్యర్థులు మొదట తమకు కవితకు సంబంధం లేదని చెప్పడం విశేషం. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం వారంతా తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం గంపగుత్తగా వారు కాంగ్రెస్ లో చేరనుండటం కవితకు మింగుడు పడని అంశమనే చెప్పాలి.
Follow Us