హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్‌

హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 'కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టట్లేదు' అని స్పష్టం చేశారు.  

drerf
New Update

Hydra: హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు. హైడ్రాపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన రంగనాథ్.. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పై ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

హైడ్రా బూచి కాదు..

'మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువగా సోషల్ మీడియానే హైడ్రాను ప్రచారం చేస్తుంది. హైడ్రా బూచి కాదు.. భరోసా ఇచ్చే సంస్థ. మేం కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవు. కొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆక్రమణల్లో పేదలు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదు. అక్రమ కట్టడాల వెనుక కొందరు బలవంతులు ఉన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. ఇష్టారాజ్యంగా కట్టుకుంటూ పోతే కట్టడి చేయవద్దా? అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. 

వారే మా అసలు టార్గెట్..

ఇక N కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్నటువంటి గుడిసెలను తొలగించలేదు. కొందరు అక్రమంగా బిజినెస్ లు చేస్తూ.. హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చాం. కొందరు సిరియస్ గా తీసుకోలేదు. అయిన వారిని ఖాలీ చేపించిన తరువాతనే కూల్చివేతలు స్టార్ట్ చేశాం. పేద వాళ్ళనీ ఇబ్బందులకు గురిచేసేందుకు హైడ్రా ఉండదు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చింది ఖాలీగా ఉన్న భవనాలు మాత్రమే. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల అకాడమిక్ సంవత్సరం నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదు. అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్ళే ప్రథమ టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. హైడ్రా సైలెంట్ గా ఏమి లేదు. హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ వెళ్తోందని రంగనాథ్ చెప్పారు. 

సుందరీకరణ కోసం కాదు..

ఇక IAS దాన కిశోర్ మాట్లాడుతూ.. మూసీపై ఈరోజు ముఖ్య పత్రికలు తప్పుడు వార్తలు రాయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నాటి నిజాం హయంలో భారి వరదలు వచ్చాయని, అప్పట్లో ఎంత ఇబ్బంది అయిందో అందరికీ తెలుసన్నారు. గత 5 యేండ్ల నుంచి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు మూసీ పరివాహక ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడుకునేందుకే. మూసీ రీ డెవలప్మెంట్. సుందరీకరణ కోసం కాదు. అక్టోబర్ నెలలో దక్షణ కొరియాకు వెళ్తున్నాం. ఈ టూర్ లో మూసీ పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, మేయర్లు, కార్పొరేటర్లు ఉంటారు. మూసీ నీళ్లను శుద్ధి చేసేందుకు STP లను నిర్మించబోతున్నట్లు తెలిపారు.

హైడ్రా వస్తుంది కూలగొడుతుంది..

మూసి రీ డెవలప్మెంట్  రివర్ లో ఇంటర్ నేష్నల్ ఏజెన్సీలు వస్తున్నాయని చెప్పారు. మొదటిగా 10 వేల కోట్లతో జూన్, జులై నెలలో మూసీ నీటిని శుద్ధి చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరి ఇండ్లను కూలగోట్టడం లేదు. ఎవరిని బలవంతంగా బయటకు పంపించడం లేదు. హైడ్రా వస్తుంది కూలగొడుతుంది అని అనడం తప్పు. ఇప్పటి వరకు మూసి పరివాహక ప్రాంతంలో 50 కుటుంబాలు తమ ఇష్టంగా షిఫ్ట్ అయ్యారు. మరో 200 కుటుంబాలు ముందుకు రావొచ్చు. బఫర్ జోన్ లో ఉండి పట్టా భూమి ఉంటే తప్పకుండా డబుల్ పెమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. పారదర్శకంగా మాత్రమే వారిని షిఫ్ట్ చేస్తున్నాం. బలవంతగా పంపించడం లేదని దాన కిశోర్ స్పష్టం చేశారు. 

#hydra #av-ranganath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి