/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
Harish Rao
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు హరీష్ పై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.
ఎఫ్ఐఆర్లో రెండో నిందితుడిగా
హరీశ్రావుపై 351(2), ఆర్డబ్ల్యూ3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు.. ఆయనను ఎఫ్ఐఆర్లో రెండో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా వంశీకృష్ణ పేరును నమోదు చేశారు. హరీష్ రావు మినహా మిగితా వాళ్లంతా ఇటీవల జైలు నుంచి విడుదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read : TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!