BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

శంషాబాద్  ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. థాయ్ లాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని మళ్లీ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

New Update
Shamshabad Airport

శంషాబాద్  ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. థాయ్ లాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని మళ్లీ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండింగ్ చేశాడు పైలట్. షెడ్యూల్ ప్రకారం ఉ. 6 గంటలకు థాయ్‌లాండ్ కు ఎయిర్ ఇండియా బోయింగ్-07 ఫ్లైట్ బయలుదేరాల్సి ఉంద. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అత్యవసర ల్యాండింగ్ కు గల కారణాలను అధికారులు ఇంకా వెళ్లడించలేదు. 

ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 272 మంది దుర్మరణం పాలయ్యారు. అప్పటి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్లపై ప్రయాణికుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్ ఇండియా తన ఫ్లైట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం చర్చనీయాంశమైంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు