Sahithi Infra : 3 వేల కోట్లకు కుచ్చుటోపీ..సాహితీ ఇన్ఫ్రాపై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్

ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో సాహితీ ఇన్‌ ఫ్రాపై ఎట్టకేలకు సీసీఎస్‌ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సుమారు రూ.3 వేల కోట్ల మేరకు మోసం చేసిన కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా పై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.

New Update
FotoJet (89)

sahithi infratech fraud

Sahithi Infra :  ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురిని మోసం చేసిన హైదరాబాద్ కు చెందిన సాహితీ ఇన్‌ ఫ్రా స్కాంపై ఎట్టకేలకు సీసీఎస్‌ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సుమారు రూ.3 వేల కోట్ల మేరకు మోసం చేసి చర్చనీయాంశంగా మారిన కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా స్కాంపై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం. సాహితీ స్కాం 3 వేల కోట్లుగా ఉంటుందని సీసీఎస్ పోలీసులు తేల్చారు.  సాహితీ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసం చేసినట్లు ఇప్పటికే ఈ సంస్థపై వేర్వేరు ప్రాంతాల్లో 64 కేసులు నమోదయ్యాయి. కాగా ఈ 64 కేసులపై సీసీఎస్ టీం విచారణ జరుపుతోంది. అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్కు సంబంధించి 17 కేసులు నమోదు కాగా 17 కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

శర్వాణి ఎలైట్కి సంబంధించి రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వసూలు చేసిన డబ్బులు మొత్తాన్ని సొంత ప్రయోజనాలకు సాహితీ లక్ష్మీనారాయణ వాడుకున్నాడని తేల్చారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ లక్ష్మీనారాయణ అతి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ మోసం చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సాహితీ స్కాంపై  మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. 

వివరాల్లోకి వెళ్తే...సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో సాహితీ ఇన్ ఫ్రా ఓ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టింది. 32 ఫ్లోర్లతో 10 హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకుంది. ప్రీ లాంచ్, ఆఫర్స్ పేరుతో 2019 నుంచి 2022 వరకు మార్కెటింగ్ చేసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే ప్రీ లాంచ్ ప్రారంభించింది. 2019 జూన్ వరకు 1,752 మందిపైకి పైగా కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. 

ఇలా మొత్తం 9 ప్రాజెక్టుల పేరుతో దాదాపు 3వేల 500 మంది దగ్గర వేల కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసింది. అయితే, ప్రీ లాంచ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. తీసుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇవ్వలేదు. దీంతో 2022 ఆగస్టులో 240 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. చాలామంది ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాగా బాధితుల ఆందోళనల నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత సీసీఎస్‌ పోలీసులు ఛార్జ్‌ షీటు దాఖలు చేయడం గమనార్హం.

ఈ స్కామ్ వల్ల పెట్టుబడులు పెట్టిన వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. బాధితులు గతంలో ధర్నాలు, నిరసనలు చేశారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. మిగతా కేసుల్లోనూ త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు