తెలంగాణ ఎన్నికలు దగ్గరపడటంతో అనేక చోట్ల నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్రంలో రూ.14,23,35,620 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రూ.6,51,03,561 నగదు, రూ.2,13,60,112 విలువైన మద్యం, రూ.1,79,69,125 విలువైన మత్తుమందులు, రూ.2,53,97,322 కోట్ల విలువ గల బంగారు ఆభరణాలు, రూ.1,25,05,500 కోట్ల విలువైన చీరలు, ఇతర ఆభరణాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పట్టుబడ్డ మొత్తం రూ.698,89,84,122కు చేరింది.
పూర్తిగా చదవండి..Telangana Elections: ఎన్నికల వేళ.. 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
తెలంగాణలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గత 24 గంటల్లో ఏకంగా రూ.14 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివారలను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
Translate this News: