Chevella MP Ranjith Reddy Resigns For BRS Party: లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. మరో ఎంపీ తాజాగా పార్టీని వీడారు. బీఆర్ఎస్కు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి (Congress) వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోనే ఉన్నారు రంజిత్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రంజిత్ రెడ్డి.