Telangana Intermediate Exams 2024: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇవాళ ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు సంబంధిత ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. ఉదయం 9 గంటల తర్వాత ఒక నిమిషం దాటినా ఎవరికి అనుమతి ఉండదు. ఇక ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా, 5,02,260 మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్లు ఉన్నారు. సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు!
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదు.
Translate this News: