Telangana High Court: ఆ విషయంలో పోలీసులు తీరు మార్చుకోవాలి: హైకోర్టు

కరీనంగర్‌ రెండో టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి వస్తే.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు తీరు మార్చుకోవాలని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

Telangana High Court: ఆ విషయంలో పోలీసులు తీరు మార్చుకోవాలి: హైకోర్టు
New Update

Telangana High Court: పోలీసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పోలీసులు ఉండేది ప్రజల కోసమని.. వాళ్లని భయాందోళనకు గురి చేయడం కోసం కాదని పేర్కొంది. పోలీసులు వారి ప్రవర్తన మార్చుకునేలా.. వారి నిర్వర్తించే విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు కూడా నిర్వహించాలని.. డీజీపీకి చెప్పాలని అదనపు ఏజీకి సూచనలు చేసింది. పోలీస్‌ స్టేషన్‌కు ప్రజలు సరదాగా రారని.. అలాగే న్యాయవాదులు, డాక్టర్లు, పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని అనుకోరని ధర్మాసనం పేర్కొంది.

Also Read: 6 నెలల్లో సీఎం రేవంత్ జైలుకు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

F.I.R నమోదు చేయించడం కూడా పౌరులకు కష్టంగా మారిందని.. ఇకపై కేసు నమోదు చేయలేదంటూ ఎవరూ కోర్టుకు రాకుండా ఉండేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఓ మహిళ అతడిపై కరీంనగర్‌ రెండో టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో.. ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశం మేరకు ఎస్‌హెచ్‌ఓ.. ఓదెల వెంకటేష్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ వాదనలు వినిపిస్తూ.. 14న F.I.R నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరగడమపై ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణలు కోరారు.

అయితే ఎస్‌హెచ్‌వోను అలా వదిలిపెట్టలేమని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం వల్ల వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. 'ఉద్యోగం నుంచి తీసేసినందుకు మహిళ ఫిర్యాదు చేయడాని వచ్చినట్లు చెబుతున్నారు. అది తప్పుడు ఫిర్యాదు అయినా కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని' స్పష్టం చేసింది. విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని చెప్పింది. ఎస్‌హెచ్‌వో వివరణ కోసం విచారణనను మార్చి 4కి వాయిదా వేస్తున్నామని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కారణాలేంటో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కుల గణనకు ముందు అది చేయండి: అక్బరుద్ధీన్ ఓవైసీ

#telangana-news #telangana-high-court #fir
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe