Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్

TG: హైకోర్టులో మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జీడిమెట్లలోని 2.5 ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జీడిమెట్లలోని సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

New Update
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్

Malla Reddy: మంత్రి పదవి పోయి మాజీ మంత్రి అయిన మల్లారెడ్డికి వరుస షాకులు తలుగుతున్నాయి. తాజాగా హైకోర్టులో మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జీడిమెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జీడిమెట్లలోని (Jeedimetla) సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

తమ అధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు, తహసీల్దార్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు మల్లారెడ్డి, ఆయన కుటుంబం. సివిల్ కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు సైతం ఆదేశించింది. విచారణ వారం వాయిదా వేసింది హైకోర్టు.

Advertisment
తాజా కథనాలు