Telangana: తెలంగాణలోని జలాశయాల పూడిక తీతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాళికతో చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు సమవేశమై పూడికలపై చర్చలు జరిపారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టర్లు ఆహ్వానించి, గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..TG News: జలాశయాల్లో పూడికలకోసం గ్లోబల్ టెండర్లు.. ఇసుక, మట్టి ఖనిజాలే ఆదాయ వనరు!
రాష్ట్రంలోని నీటి పారుదల జలాశయాల్లో పూడికతీత పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పనులను గ్లోబల్ టెండర్లకు అప్పగించి, ఇసుక, మట్టితో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.
Translate this News: