YS Sharmila: కేసీఆర్ అందుకే ఇలా చేస్తున్నాడు.. షర్మిల షాకింగ్ కామెంట్స్!

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే!

Telangana Elections 2023: మరో వారంలో ఎన్నికలు జరగనున్న వేళ YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి రామేమో అనే భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆమె ట్విట్టర్(X) వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు.

ALSO READ: అందరికీ ఉచిత విద్య, వైద్యం.. బర్రెలక్క సంచలన మేనిఫెస్టో..

షర్మిల ట్విట్టర్ లో... 'ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు సాయం చేస్తున్న మోదీ గారు.. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.' అంటూ రాసుకొచ్చారు.

తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ''ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నాడు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు సాయం చేస్తున్న మోదీ గారు.. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయి. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, మద్దతుదారులను మీరు ఇబ్బందులపాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.కాలేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ పై ఎలాంటి విచారణ ఉండదు.. లిక్కర్ స్కాంలో వేలకోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరు, భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు జరగవు.. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు.. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు.. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు" అని ఉంది.

Advertisment
తాజా కథనాలు