BREAKING: మేడ్చల్‌లో హైటెన్షన్‌.. కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు

మేడ్చల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోడుప్పల్‌, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు డబ్బు దాచారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

Telangana Elections 2023: ఎన్నికల సమీపిస్తున్న వేళ మేడ్చల్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బోడుప్పల్‌, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

అసలేం జరిగింది:

ఏవీ ఇన్ఫో ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు డబ్బు దాచారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అపార్ట్‌మెంట్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు పెద్ద సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. మేయర్ జక్కా వెంకట్ రెడ్డి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో దాచిన సొమ్మును గుర్తించేందుకు మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేయర్‌, సుధీర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

#telangana-elections-2023 #telugu-latest-news #brs-vs-congress #minister-mallareddy #trending-in-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe