Telangana Congress: ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన అనంతరం కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. కొందరు నేతలు పార్టీకి రాజీనామాచేస్తే.. మరికొందరు రెబెల్ అభ్యర్థులుగా రంగంలో దిగుతామని ప్రకటించారు. ఇంత కాలం పార్టీని నమ్ముకుని పని చేసిన తమను పక్కన పెట్టటంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ శాఖ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కూకట్పల్లి టికెట్ దక్కకపోవటంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిలో రెబెల్ అభ్యర్థిగా రంగంలో ఉంటానని ప్రకటించారు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. వడ్డేపల్లికి టికెట్ దక్కలేదని ఆయన అనుచరుడు, నాగిరెడ్డిపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ నిరాశకు గురయ్యాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కార్యకర్తలు అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. అలాగే జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్థన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్లో హల్ చల్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Congress: టీ కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు.. పలువురు నేతల రాజీనామా.. రెబెల్గా బరిలోకి..
తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి ఇప్పుడు ఆగమాగం ఉంది. టికెట్లు దక్కినోళ్లు సంబరపడిపోతూ ప్రచారం మొదలు పెడితే.. టికెట్ దక్కనోళ్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కకపోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంతే కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్లో సీట్ కన్ఫామ్ కాని నేతలు కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తుంటే.. మరికొందరు రెబల్గా పోటీకి సిద్ధమవుతున్నారు. వెంగళరావు, షేక్ అబ్దుల్లా, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వంటి వారు పార్టీకి రాజీనామా చేయగా.. కొందరు రెబల్గా పోటీ చేస్తామన్నారు.
Translate this News: