తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఏకంగా వరుసగా 14 రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకు వీరి పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. దాదాపు ప్రతీ జిల్లా, ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేసేలా వీరి పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకులు రూట్ మ్యాప్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇది కూడా చదవండి: Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్: కోదండరామ్
TS Congress: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం!
ఎన్నికలకు ముందు 15 రోజులు అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించనున్నారు.
Translate this News: