ముగిసిన సీఎల్పీ సమావేశం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకు

కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు.

New Update
ముగిసిన సీఎల్పీ సమావేశం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకు

హైదరాబాద్ గచ్చిబౌలీలోని  ఎల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశం ముగిసింది. సీల్పీ నేత ఎంపికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. కాగా ఈ ఏక వ్యాఖ్య తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వర రావు రేవంత్ తీర్మానాన్ని బలపరిచారు. దీంతో  ఈ రోజే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమవగా సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని వారి అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.

Also read : Election Guarantees: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?

Advertisment
తాజా కథనాలు