CM Revanth: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే!

యూపీఎస్సీ తరహాలోనే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని మండిపడ్డారు. జేఎన్టీయూలో నిర్వహించిన సదస్సుకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

CM Revanth: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే!
New Update

JNTUH: రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ యువత గత పదేళ్లు ఉద్యోగాల కోసం కొట్లాడింది వాయిదాలు వేయడానికేనా అంటూ ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్..
ఈ సందర్భంగా నిరుద్యోగులు, విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడిన రేవంత్.. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లు మాత్రమేనని చెప్పారు. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రస్తుతం కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ప్రజెంట్ సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీగా ఉందని, ఆ తర్వాతే అభివృద్ధి గురించి వివరించారు. అలాగే గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్ - 2024 లోగోను విడుదల చేసిన ముఖ్యమంత్రి.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. పుస్తకాల్లో చదువులకు, బయట మార్కెట్ లో సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్ సిలబస్ లు ఉన్నాయన్నారు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్పా.. వారిలో పనితనం ఉండట్లేదన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడేలా టెక్నికల్ కోర్సులు సిలబస్ మారాలని సూచించారు. ప్రభుత్వానికి భేషజాలు లేవు, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటాం. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుంది. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. అదే మా ప్రభుత్వ విధానం అని చెప్పారు.

నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫాక్టరీలు..
ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫాక్టరీలుగా ఉండకూడదన్నారు. JNTU నుంచి ఏటా లక్షమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ ఔవుట్ అవుతున్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదు. ఈ అకాడమిక్ ఈయర్ నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్ చెల్లిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ లో నాడు IDPL ను ఇందిరా గాంధీ పెట్టడం వల్లే నేడు ఫార్మారంగం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.
2030 నాటికల్లో ఐటీ రంగంలో కర్ణాటకని అదిగమిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నాం. మంచి సలహాలు ఇస్తే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యావేత్తలను కోరారు.

#jntuh #cm-revanth #telangana-job-calendar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి