Telangana : 'ఇందిరమ్మ కానుక' ఎప్పటి నుంచి అమలు? కీలక అప్‌డేట్స్ మీకోసం..

తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి స్థానంలో 'ఇందిరమ్మ కానుక' పథకాన్ని ప్రారంభించనుంది. అయితే, ఈ పథకం ఎప్పుడొస్తుంది? ఎంత నగదు ఇస్తారు? చెప్పినట్లుగా బంగారం ఇస్తారా? డబ్బు ఇస్తారనే సందేహం ప్రజల్లో నెలకొంది. పథకం అమలుపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
Telangana : 'ఇందిరమ్మ కానుక' ఎప్పటి నుంచి అమలు? కీలక అప్‌డేట్స్ మీకోసం..

Telangana Indiramma Kanuka : యావత్ తెలంగాణ(Telangana) సమాజం.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. కొందరైతే.. ఇప్పుడు పెళ్లి చెయ్యాలా? కొంతకాలం ఆగి చెయ్యాలా? అని ఆలోచిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే.. గత ప్రభుత్వం ఇచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని(Kalyana Lakshmi Scheme).. కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా? అన్న సందేహంతోనే. ఎన్నికల వేళ కల్యాణి లక్ష్మి తరహాలోనే ఇందిరమ్మ కానుక పేరుతో పథకం ప్రారంభిస్తామని హామీని ప్రకటించింది కాంగ్రెస్. ఈ పథకం కింద.. హిందూ, మైనారిటీ ఆడపడుచుల వివాహానికి రూ. రూ. లక్ష నగదుతో పాటు.. తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా? కల్యాణ లక్ష్మికి కొనసాగింపుగా ఇస్తారా? లేక కొంతకాలం తరువాత ఇందిరమ్మ కానుకను అమలు చేస్తారా? అని సందిగ్ధంలో ఉన్నారు జనాలు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే.. ఇందిరమ్మ కానుక పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాలు, వర్గాల ఆడ బిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి తరహాలోనే 'ఇందిరమ్మ కానుక'ను ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ. లక్ష నగదు, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారా? అని ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగితే.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న ఆడ బిడ్డలందరికీ వర్తిస్తుంది. ఆ పథకం కింద రూ. 10,0116 అందిస్తారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో.. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు జనాలు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాంగ్రెస్ ప్రకటించిన హామీ అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్కీమ్‌ను ఎలా అమలు చేస్తానే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు తులం బంగారం ఇస్తారా? లేక దానికి బదులుగా డబ్బు ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల పైనే ఉంది. కళ్యాణ లక్ష్మి పేరుతో స్కీమ్‌ను అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. ఈ స్కీమ్ కింద రూ. 10,0116 అందించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆడబిడ్డలందరికీ ఈ పథకం వర్తింపజేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Also Read:

నళినికి మళ్లీ డీఎస్పీ పోస్టింగ్? సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

500కే గ్యాస్‌ సిలిండర్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..

Advertisment
తాజా కథనాలు